శబరిమల భక్తులకు అత్యవసర హెచ్చరిక | Sabarimala Security Alert for Devotees | Sakshi
Sakshi News home page

శబరిమల భక్తులకు అత్యవసర హెచ్చరిక

Aug 1 2026 6:45 PM | Updated on Aug 1 2026 7:23 PM

 Sabarimala Security Alert for Devotees

తిరువనంతపురం: పంపా ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో శబరిమల భక్తులకు కేరళ అధికారులు, పోలీసులు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 2, 3 తేదీలలో నిరపుత్తరి (Niraputhari) దర్శనానికి శబరిమల వెళ్లాలని ప్రణాళిక వేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించాలని ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం భద్రతా హెచ్చరిక (Security Alert) జారీ చేయడంతో భక్తులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని బోర్డు చెప్పింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అనవసర ప్రయాణాలను నివారించాలని బోర్డు కోరింది. 

పతనంతిట్టలో పతనంతిట్టలో పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు, శబరిమల యాత్రికులకు యాత్ర కొనసాగించేందుకు అనుమతి, భద్రతా సలహా జారీకి సంబంధించిన పూర్తి వివరాలు..

యాత్రికులు పాటించాల్సిన ముఖ్య సూచనలు

  • సన్నాహకంగా వాహన ప్రయాణం చేయవద్దు.

  • అడవి / పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలపవద్దు.

  • అనవసరంగా అడవి ప్రాంతాలు, ల్యాండ్ స్లైడ్ ప్రాంతాలకు వెళ్లవద్దు.

  • అధికారుల నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే వాహనాలు ఉంచండి.

  • వాటర్ ఫాల్స్ , నదులు , వాగులు, ఇతర నీటి గీత మడుగుల్లో స్నానాలు, ఈత, వినోదానికి వెళ్ళవద్దు.

  • భారీ వర్షాల సమయంలో అనవసర సమయం గడపడం ప్రమాదకరం.

  • జాగ్రత్త , చిత్తశుద్ధి పాటించాలి.

  • అడవి జంతువుల సంచారం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ప్రయాణం చేయవద్దు.

  • పోలీస్, అటవీ, ఆరోగ్య మరియు విపత్తు నిర్వహణ అధికారుల సూచనలు కచ్చితంగా పాటించాలి.

  • అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్, విపత్తు నిర్వహణ సిబ్బందిని సంప్రదించాలి. 

పతనంతిట్ట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ (24x7)
9497960963
9497908045
0468 2222600

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement