లక్నో: ఉత్తరప్రదేశ్ బలరాంపూర్లో దారుణం జరిగింది. ఈ రోజు (శనివారం) ఇద్దరు చిన్న పిల్లలతో పాటు దంపతులను దుండగులు అత్యంత పాశవికంగా కాల్చిచంపారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు భజరంగ్ గిరి, కోమలి పిల్లలు శ్రద్ధ, ఏడాది బాలుడు జైదీప్గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
మృతదేహాలను పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందని, దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.


