
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానాలో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షీగాన్-కామ్గాన్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు.. బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన రెండు వాహనాలను మరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Buldhana, Maharashtra: A triple accident on Shegaon-Khamgaon Highway involving a Bolero, an ST bus, and a private bus killed five people and injured 24. The injured are receiving treatment at Khamgaon government hospital pic.twitter.com/dIWmrwPEN9
— IANS (@ians_india) April 2, 2025