రూ.500 లంచం తీసుకున్నందుకు పదేళ్ల తర్వాత జైలు | Retd Village Accountant Gets One Year Jail For Rs 500 Bribe He Took 30 Years Back | Sakshi
Sakshi News home page

రూ.500 లంచం తీసుకున్నందుకు పదేళ్ల తర్వాత జైలు

Jun 21 2025 9:17 AM | Updated on Jun 21 2025 9:18 AM

Retd Village Accountant Gets One Year Jail For Rs 500 Bribe He Took 30 Years Back

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రూ.500 లంచం తీసుకున్న పాపానికి రిటైర్డ్‌ అయిన 10 సంవత్సరాలకు ఒక విలేజ్‌ అకౌంటెంట్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. నాగేశ్‌ శివంగేకర్‌ 30 సంవత్సరాల క్రితం విధుల్లో ఉన్న సమయంలో బెళగావి తాలూకా కడోలి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ ఓ పని కోసం నాగేశ్‌ను ఆశ్రయించగా రూ.500 లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో లక్ష్మణ్‌  లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. 

పథకం ప్రకారం  లోకాయుక్త పోలీసులు దాడి చేసి నాగేశ్‌ను అరెస్టు చేశారు. 2006లో నాగేశ్‌కు కోర్టు రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది. తర్వాత ధార్వాడ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేసింది. అయితే అప్పటికే నాగేశ్‌ రిటైర్‌ య్యారు. అయితే లోకాయుక్త సుప్రీకోర్టుకు అప్పీలుకు వెళ్లింది.  నాగేశ్‌కు పది సంవత్సరాల జైలు శిక్షను  కోర్టు ఖరారు చేసింది.  ఆయన్ను బెళగావి హిండలగా జైలుకు తరలించారు. కాగా ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెంది 5ఏళ్లు కావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement