
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రూ.500 లంచం తీసుకున్న పాపానికి రిటైర్డ్ అయిన 10 సంవత్సరాలకు ఒక విలేజ్ అకౌంటెంట్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. నాగేశ్ శివంగేకర్ 30 సంవత్సరాల క్రితం విధుల్లో ఉన్న సమయంలో బెళగావి తాలూకా కడోలి గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఓ పని కోసం నాగేశ్ను ఆశ్రయించగా రూ.500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో లక్ష్మణ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు.
పథకం ప్రకారం లోకాయుక్త పోలీసులు దాడి చేసి నాగేశ్ను అరెస్టు చేశారు. 2006లో నాగేశ్కు కోర్టు రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది. తర్వాత ధార్వాడ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేసింది. అయితే అప్పటికే నాగేశ్ రిటైర్ య్యారు. అయితే లోకాయుక్త సుప్రీకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. నాగేశ్కు పది సంవత్సరాల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఆయన్ను బెళగావి హిండలగా జైలుకు తరలించారు. కాగా ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెంది 5ఏళ్లు కావడం గమనార్హం.