లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు | Petrol, diesel price cut by up to Rs 15 in Lakshadweep | Sakshi
Sakshi News home page

లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు

Mar 17 2024 5:33 AM | Updated on Mar 17 2024 9:13 AM

Petrol, diesel price cut by up to Rs 15 in Lakshadweep - Sakshi

న్యూఢిల్లీ: లక్ష ద్వీప్‌లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది.

లక్షద్వీప్‌ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్‌ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్‌ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్‌ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్‌ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్‌ దీవుల్లో డీజిల్‌ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement