‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ | People Reacted on x After the Earthquake in Delhi | Sakshi
Sakshi News home page

‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ

Feb 17 2025 9:48 AM | Updated on Feb 17 2025 10:29 AM

People Reacted on x After the Earthquake in Delhi

న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి  బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్‌ల ద్వారా పంచుకున్నారు.
 

‘ఎక్స్‌’ ప్లాట్‌ఫారంపై నవనీత్‌ సింగ్‌ అనే యూజర్‌ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. మరో యూజర్‌ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.

@swaris16 అనే యూజర్‌ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్‌ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.

అనిష్‌ అనే యూజర్‌ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.

ఇంకొక యూజర్‌ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement