ఫ‍్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. బాత్‌రూం డోర్ పగులగొట్టి.. | Passenger Assaulted Crew Onboard Toronto Delhi Flight In Air India | Sakshi
Sakshi News home page

ఫ‍్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్‌రూం డోర్ పగులగొట్టి..

Jul 12 2023 9:30 PM | Updated on Jul 12 2023 9:38 PM

Passenger Assaulted Crew Onboard Toronto Delhi Flight In Air India - Sakshi

ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానంలో సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విమానం టాయిలెట్‌ తలుపునూ పగులగొట్టాడు. టొరంటో నుంచి ఢిల్లీ వస్తోన్న విమానంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రయాణికునిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నేపాల్‌కు చెందిన మహేశ్‌ సింగ్‌ పండిత్‌ అనే ప్రయాణికుడు కెనడా నుంచి ఇండియా‌కు ఎయిరిండియా విమానంలో బయలుదేరాడు. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే తనకు కేటాయించిన సీటులో కాకుండా పక్క సీటులో కూర్చున్నాడు. ఆ తర్వాత టాయిలెట్‌లో ధూమపానం చేయడంతోపాటు ఆ తలుపును పగలగొట్టాడు. అడ్డుపడిన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై ఎదురుదాడి చేశాడని విమానంలోని సిబ్బంది తెలిపారు.

చాలా గొడవ చేసిన తర్వాత  ఎట్టకేలకు ప్రయాణికులతో కలిసి నిందితున్ని సీట్లో కూర్చోబెట్టామని విమాన సిబ్బంది తెలిపారు. విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన‍్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ తోటివారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ముంబయిలోనూ విమానంలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్‌.. వలలో చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్.. వీడియో వైరల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement