పార్లమెంట్‌లో వర్షపు నీరు లీకేజీ!.. కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం | Parliament Building Water Leakage Viral Video: Congress Wants Discussion | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో వర్షపు నీరు లీకేజీ.. కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

Aug 1 2024 8:53 AM | Updated on Aug 1 2024 9:11 AM

Parliament Building Water Leakage Viral Video: Congress Wants Discussion

పార్లమెంట్‌ భవనంలో వర్షపు నీరు లీకేజీ కావడం.. ఆ వీడియోలు కాస్త నెట్టింటకు చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానకు రాష్ట్రపతి ఛాంబర్‌ దగ్గరి లాబీలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. అయితే.. ఈ లీకేజీపై పార్లమెంట్‌ నిర్వాహణ అధికారులు స్పందించాల్సి ఉంది. 

మరోవైపు కిందటి ఏడాది మే నెలలో సన్‌సద్‌ భవనం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ భవనం.. అందులో హంగుల కోసం 1,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. అయితే.. ప్రస్తుతం వాటర్‌ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ వాటర్‌ లీకేజీ అంశాన్ని సభలో చర్చించాలని భావిస్తోంది. 

ఈ మేరకు.. వాటర్‌ లీకేజీ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ విప్‌ మాణిక్కం ఠాగూర్‌.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement