ఏనుగుతో సెల్ఫీకి యత్నం..యువకుడి దుర్మరణం | Man Tried To Take Selfie With Elephant And Lost Life | Sakshi
Sakshi News home page

ఏనుగుతో సెల్ఫీకి యత్నం..యువకుడి దుర్మరణం

Oct 25 2024 7:22 PM | Updated on Oct 25 2024 7:43 PM

Man Tried To Take Selfie With Elephant And Lost Life

నాగ్‌పూర్‌: సెల్ఫీ సరదా మరో నిండు ప్రాణం తీసింది. 23 ఏళ్ల ఓ యువకుడు ఏకంగా ఏనుగుతో అడవిలో సెల్ఫీ తీసుకునే సాహసం చేశాడు. ఇంకేముంది ఆ అడవి గజరాజుకు కోపం కట్టలు  తెంచుకుది. శశికాంత్‌ రామచంద్ర అనే ఆ యువకుడిని తొండంతో కొట్టి కిందపడేసి కాళ్ల కింద తొక్కి నలిపేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం(అక్టోబర్‌ 24) జరిగింది. శశికాంత్‌ అతని స్నేహితులతో కలిసి అడవిలో కేబుల్‌ వేసే పని కోసం వెళ్లాడు. ఫారెస్ట్‌ సిబ్బంది ఎంత చెబుతున్నా వినకుండా ఏనుగులుండే ప్రదేశానికి వెళ్లి దానితో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. శశికాంత్‌ స్వస్థలం మహారాష్ట్రలోని చంద్రపూర్‌.

ఇదీ చదవండి: ప్రాణం తీసిన సెల్ఫ్‌  డ్రైవింగ్‌ కార్‌ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement