Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే! | Lok Sabha Elections 2024: Eight percent womens participate in second phase polls | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే!

Apr 25 2024 4:18 PM | Updated on Apr 25 2024 4:18 PM

Lok Sabha Elections 2024: Eight percent womens participate in second phase polls - Sakshi

కోటీశ్వరుల్లో ‘టాప్‌’ లేపిన కర్నాటక

ఆరుగురికి చిల్లిగవ్వ కూడా లేదట!

లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది (మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బీఎస్పీ అభ్యర్థి అశోక్‌ భలావి మరణంతో అక్కడ పోలింగ్‌ వాయిదా పడింది). రెండో దశలో 1,210 మంది పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడార్‌) విశ్లేíÙంచగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి...

► రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతమే ఉన్నారు!
► పట్టభద్రులు, ఆపై చదువులు చదివిన వారు 43 శాతం.
► 21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. వారిలో 167 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్‌ (35), తర్వాత బీజేపీ (31), సీపీఎం (14) టాప్‌లో ఉన్నాయి.
► 390 మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 105 మంది ఇండిపెండెంట్లు. తర్వాతి స్థానాల్లో బీజేపీ (64), కాంగ్రెస్‌ (62), బీఎస్పీ (24) నిలిచాయి. ఇద్దరికి 500 కోట్ల పైగా ఆస్తి ఉంది!
► టాప్‌–10 సంపన్న అభ్యర్థుల్లో కర్నాటక టాప్‌లో ఉంది. మండ్య కాంగ్రెస్‌ అభ్యర్థి వెంటకరమణే గౌడ రూ.623 కోట్లతో ‘టాప్‌’ లేపారు. బెంగళూరు రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేశ్‌ రూ.593 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. హేమమాలినికి రూ.279 కోట్ల ఆస్తులున్నాయి.  మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సంజయ్‌ శర్మ (రూ.233 కోట్లు), మండ్యలో జేడీ(ఎస్‌) చీఫ్‌ కుమారస్వామి (రూ.217 కోట్లు), యూపీలో అమ్రోహా బీజేపీ అభ్యర్థి కన్వర్‌ సింగ్‌ తన్వర్‌ (రూ.215 కోట్లు) టాప్‌–10లో నిలిచారు.
► రెండో విడత అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.2 కోట్లు. ఆరుగురు తమకు చిల్లిగవ్వ కూడా లేదని ప్రకటించడం విశేషం!
► అభ్యర్థుల్లో ఎక్కువ మంది 40–50 ఏళ్ల మధ్యవారే. సగటు వయసు 49 ఏళ్లు. 70–80 ఏళ్ల మధ్య వయసు్కలు 49 మంది ఉండగా ఇద్దరు 80 ఏళ్లు పైబడ్డారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement