కోల్‌కతా డాక్టర్‌ కేసు: ‘ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి’ | Kolkata doctor case: MHA seeks updates every 2 hours from states and UTs | Sakshi
Sakshi News home page

కోల్‌కతా డాక్టర్‌ కేసు: ‘ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి’

Aug 18 2024 2:03 PM | Updated on Aug 20 2024 11:14 AM

Kolkata doctor case: MHA seeks updates every 2 hours from states and UTs

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ డాక్టర్‌ జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్‌ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సీబీఐకు దర్యాప్తు కొసాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement