-
జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తూ.. ఒక్కసారిగా ఇలా అవ్వడంతో..
ఖమ్మం: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ సుమ (23) డెంగీ జ్వరంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. సుమ హైదరబాద్లో ఓ ప్రైవేట్ వైద్యశాలలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని హైదరబాద్ నుంచి సీతానగరం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సుమ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: దయచేసి.. మా కుమారుడిని కాపాడండి! -
పీజీ మెడికో ఆత్మహత్యాయత్నం.. ఇంజక్షన్ కోసం మొబైల్లో సెర్చ్ చేసి!
సాక్షి వరంగల్/ఎంజీఎం: ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వేధింపులు భరించలేక. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారోనని భయపడింది. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా వేధింపులు తగ్గలేదు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే తనలోతాను కుమిలిపోయి ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. అదీ ఆస్పత్రిలో డ్యూటీగా ఉండగా జరగడంతో కలకలం సృష్టించింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబం హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తె అయిన ప్రీతి(26) ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని కేఎంసీలో అనస్తీషియా పీజీ కోర్సులో 2022లో చేరింది. ప్రస్తుతం థియరిటికల్ క్లాస్లు జరుగుతున్నాయి. ఇక్కడే వేధింపులు అనస్తీషియా వైద్య విభాగ డ్యూటీ చార్టులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్(ఈఓటీ)లో రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఎస్ఆర్, ఒక సీనియర్ పీజీ, ఇద్దరు జూనియర్ పీజీ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని రోజులుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తోంది. ఇక్కడ పరిచయమైన సీనియర్ సైఫ్ కొంతకాలంగా వేధిస్తున్నట్లు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ మోహన్దాసు ఆదేశాల మేరకు అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం సైఫ్, ప్రీతిలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. ట్రెమడాల్ ఇంజక్షన్ ఎప్పుడు వాడుతారంటే.. ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ 50 ఎంజీ ఇంజక్షన్ కీళ్లు, కండరాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో మితమైన, తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనకు నొప్పి ఉందని చెప్పే మెదడులోని రసాయన దూతలను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, అస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. చికిత్స పొందుతున్న పరిస్థితినిబట్టి మోతాదు, వ్యవధిని డాక్టర్ నిర్ణయిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు.. విద్యలో ఎదురయ్యే ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే విద్యార్థిని ప్రీతి కాదని బంధుమిత్రులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలోనూ సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో ఉద్యోగులకు సేవలందించిందని తెలిపారు. ప్రీతి తండ్రి రైల్వే విభాగంలో చేస్తున్న క్రమంలో తన తండ్రితో విధులు నిర్వర్తిస్తున్న వారి ఆరోగ్య సంరక్షణకు సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో విస్తృత సేవలందించిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుంది..? ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిందో ఎవరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ప్రీతి అనస్తీషియా ఇంజక్షన్ల సమాచారం కోసం తన సెల్ఫోన్లో తీవ్రంగా సెర్చ్ చేసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో తీసుకునే ట్రెమడాల్ ఇంజక్షన్ తీసుకున్నట్లు కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. కానీ.. ప్రీతి ట్రెమడాల్ ఇంజక్షన్ కాకుండా అనస్తీషియా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టుతోపాటు తన శరీరంలో పలు అవయవాలు పనిచేయకుండా పోయాయని మరికొందరు వైద్యులు చర్చించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో అనస్తీషియా ఇంజక్షన్ వికటించిన సందర్భంలో సైతం ఇద్దరు రోగులు కార్డియాక్ అరెస్టు కావడం వల్ల చనిపోయిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు. మంత్రుల ఆరా.. ప్రీతి ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పందించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాసు, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేధింపులు అయితే విచారణ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా స్పందించారు. సీపీ రంగనాథ్తో మాట్లాడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే.. కాలేజీ, ఆస్పత్రిలో ర్యాగింగ్, వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్పై ప్రిన్స్పాల్కు ఫిర్యాదు చేస్తా అంటే వద్దు డాడీ అంటూ నివారించిందని తండ్రి తెలిపారు. ఈనెల 20న ఏడుస్తూ కాల్ చేసిందని, పీజీ సీనియర్ డాక్టర్ అరాచకంపై ఏసీపీ కిషన్కు చెప్పినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో తనపై ఫిర్యాదు చేస్తావంటూ మరోసారి సైఫ్ ప్రీతిని బెదిరించగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పాడు. ఎంజీఎం సూపరింటెండెంట్ ఏమన్నారంటే.. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో పలు అంశాలు వివరించారు. ఆపరేషన్ థియేటర్లో ప్రీతి కాకుండా విధుల్లో ఉన్న మరో అమ్మాయి, అబ్బాయితో మాట్లాడితే ఇంజక్షన్ ఏమీ తీసుకోలేదన్నారని తెలిపారు. ఆమెను పరిశీలిస్తే కార్డియాక్ అరెస్టు రావడంతో వైద్య బృందంతో సీపీఆర్(కార్డియో పులుమోనరీ రెసిటేషన్) ద్వారా చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించామని చెప్పారు. గుండెకు సంబంధించి 28 శాతం ఏజెక్షన్ ఫ్రాక్షన్ ఒఫ్ హార్ట్, గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు. ప్రీతికి థైరాయిడ్ సమస్య, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టుగా తేలిందని చంద్రశేఖర్ తెలిపారు. కొన్ని రోజుల నుంచి ఓ అబ్బాయి వేధిస్తున్నాడు.. కొద్ది రోజుల నుంచి ఓ అబ్బాయి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని తన సోదరికి, కుటుంబ సభ్యులకు చెప్పింది. మాట్లాడుదామని భరోసా ఇచ్చాం. ఉదయం ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని మాకు చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. – దేవేందర్, ప్రీతి మేనమామ -
పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం.. యువ వైద్యుడి మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడి నిశ్చితార్థానికి అతని సొంతూరుకు వెళ్దామని ఆనందంతో ఉన్న మిత్రులు.. ఆ స్నేహితుడి మృతదేహాన్నే తీసుకువెళ్లాల్సి రావడం కలలో కూడా అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. 29 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండాయని భోరున విలపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో యువ వైద్యుడు పూర్ణచంద్ర బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ► ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్ఆర్ఐ కాలేజీలో ఎంబీబీఎస్, గాంధీ మెడికల్ కాలేజీ జనరల్ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్ చదువుకున్నారు. ► గాంధీలోనే సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్)గా విధులు నిర్వర్తించి ఈ ఏడాది జూలైలో పూర్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కోసం స్నేహితులతో కలిసి పద్మారావునగర్లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెలో స్వల్పంగా నొప్పి రావడంతో గాంధీలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలన్నీ నార్మల్గానే వచ్చాయి. ► బుధవారం ఉదయం 5 గంటలకు మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో ఎసిడిటీ అనుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చి ఇంజక్షన్ తీసుకున్నారు. పద్మారావునగర్లోని గదికి వెళ్లవద్దని, అత్యవసర విభాగ భవనం పైనున్న పీజీ హాస్టల్లో ఉండాలని సహచర వైద్యుల సూచన మేరకు మెట్ల మార్గంలో వెళ్తున్న క్రమంలో తీవ్రస్థాయిలో హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు అతడిని ఐసీయూలో అడ్మిట్ చేసి తీ వ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. పది రోజుల్లో నిశ్చితార్థం.. పూర్ణచంద్ర గుప్తాకు మరో పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. గతంలోనే ఆయన తల్లి చనిపోయింది. వెన్నెముక ఆపరేషన్ చేయించుకుని బెడ్కే పరిమితమైన తండ్రి బాగోగుల్ని సోదరుడు చూస్తున్నాడు. పూర్ణచంద్ర కోరిక మేరకు నిశ్చితార్థానికి వైద్య మిత్రులంతా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మృత్యువు కబళించడంతో అంత్యక్రియలకు స్నేహితుని మృతదేహాన్ని తీసుకుని ఆయన సొంతూరుకు వెళ్తున్నామని భోరుమన్నారు. పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్ ప్రకాశరావు, సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులు నివాళులర్పించారు. -
జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
-
నెల పోరాటం.. కరోనాతో డాక్టర్ మృతి
భోపాల్ : కరోనాతో నెలరోజులు పోరాడిన ఓ జూనియర్ వైద్యుడు చివరికి ఆసుపత్రిలోనే మరణించాడు. వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాకి చెందిన డాక్టర్ జోగిందర్ చౌదరి (27)కు జూన్ 27న కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 'జోగిందర్కు ఇంతకు ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ కరోనా కారణంగా మా ఆసుపత్రికి తీసుకొని వచ్చినప్పుడే అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఐసీయూకు తరలించి వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షించింది. జూలై 16న జోగిందర్ ఆరోగ్యం కాస్తా మెరుగయ్యింది. స్నేహితులతో కూడా మాట్లాడిన జోగిందర్ తన ఆరోగ్యం మెరుగవుతోందని చెప్పాడు. వైద్యులు ప్రయత్నం చేసినా జోగిందర్ ఆరోగ్యం రోజురోజుకూ విషమించి చనిపోయాడని' ఆస్పత్రి ఎండీ డిఎస్ రానా తెలిపారు. (14 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు) జోగిందర్ మరణించాడన్నా వార్త ఇంకా తల్లికి తెలియనివ్వలేదు. హోం క్వారంటైన్లో ఉన్న కొడుకు ఆరోగ్య పరిస్థితిపై దిగులు చెంది అనారోగ్యం బారిన పడి ఆమె ప్రస్తుతం ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. ఓ సాధారణ రైతు కుటుంబుంలో జన్మించిన జోగిందర్ బాబా సాహెబ్ అంబేద్కర్ (బిఎస్ఎ) ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వర్తించేవాడు. ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేకపోవడంతో మాఫీ చేయాలని కోరుతూ ఎస్జీఆర్హెచ్ మెడికల్ డైరెక్టర్కు జోగిందర్ తండ్రి లేఖ రాశారు. ఆసుపత్రిలో ఇప్పటికే 3.4 లక్షల బిల్లు కావడంతో బిఎస్ఎ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా జోగిందర్ పరిస్థితిని వివరిస్తూ ఆర్థిక సహాయం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాసింది. నిధులు సమకూరుస్తుండగానే డా. జోగిందర్ కన్నుమూశాడు. పుట్బాల్ సహా వివిధ క్రీడలపై ఆసక్తి ఉన్న జోగిందర్ వివాహం త్వరలోనే జరగాల్సి ఉంది. అయితే జీవితంపై ఎన్నో కలలతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్న జోగిందర్ అవి తీరకుండానే మృత్యుఒడిలోకి జారుకున్నాడు. (బీజేపీ ఎమ్మెల్యేకు ప్రియాంక తేనీటి ఆహ్వానం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement