Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి | West Bengal: Junior doctors reject 2nd govt talks offer, set fresh conditions | Sakshi
Sakshi News home page

Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి

Sep 12 2024 5:05 AM | Updated on Sep 12 2024 5:05 AM

West Bengal: Junior doctors reject 2nd govt talks offer, set fresh conditions

మమత సమక్షంలోనే చర్చలు 

30 మందిని అనుమతించాలి 

జూనియర్‌ డాక్టర్ల షరతులు 

కుదిరే పనికాదన్న సర్కారు 

కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్‌ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్‌ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్‌ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. 

సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌ జూనియర్‌ డాక్టర్లకు ఈ–మెయిల్‌ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్‌ మెయిల్‌లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్‌ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్‌ పేర్కొన్నారు. 

దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్‌ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్‌ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. 

షరతులకు ఒప్పుకోం 
బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్‌ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్‌ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement