కడప అర్బన్ : జూనియర్ డాక్టర్ల (జూడాలు) సమ్మె ఉధృతమవుతోంది. మంగళవారం రిమ్స్లో జూడాల అసోసియేషన్ ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. 107 జీఓ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిన్నర కాలంపాటు పనిచేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని, అలా పనిచేసే దమ్ము మాకుంది...అయితే తమకు శాశ్విత ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అంటూ నినదించారు. మొదట ఓపీ విభాగం ఎదుట నినాదాలు చేసిన అనంతరం ర్యాలీగా ఐపీ, దంత వైద్య కళాశాల వరకు వెళ్లారు.
అక్కడ డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ఓపీ విభాగం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల పాలిట శాపంగా 107 జీఓను అమలు చేయాలని చూస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాము వైద్య సేవలు అందిస్తేనే పట్టభద్రులను చేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు.
అలాగే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని నిబంధన తీసుకొచ్చారేగానీ గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య శాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య శాలల్లో పనిచేస్తూ వారికి వైద్య సేవలు అందించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, అలా పనిచేయాలంటే తమకు శాశ్విత ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఇబ్బందుల్లో రోగులు
అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలను జూడాలు బహిష్కరించారు. ఓపీ విభాగంలో రోగులు వందలాది మంది వచ్చి ఎదురు చూస్తున్నా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. ప్రతి విభాగంలో ఉన్న ఒక్కో డాక్టరు క్యాజువాలిటీ డ్యూటీకి, ఐపీ విభాగం డ్యూటీలకు హాజరవుతూ కొన్ని ఓపీ విభాగాలలో తక్కువ సమయం కేటాయించారు. దీంతో రోగులు చాలా సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
అలాగే ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన వికలాంగులు సడేరాం కార్యక్రమానికి వచ్చి వారు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ఈ విషయమై రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్ను మీడియా బృందం వివరణ కోరగా, రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మె కొనసాగుతోందని, తాము ఉన్న వైద్యులతోనే వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
జూడాల సమ్మె ఉధృతం
Published Wed, Nov 26 2014 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement