జీ20 ప్రాంగణంలోకి వర్షం నీరు | G20 Summit: Venue of G20 flooded due to rain | Sakshi
Sakshi News home page

జీ20 ప్రాంగణంలోకి వర్షం నీరు

Sep 11 2023 5:41 AM | Updated on Sep 16 2023 4:50 PM

G20 Summit: Venue of G20 flooded due to rain - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం కురిసిన భారీ వర్షం ప్రభావం జీ20 సదస్సుపైనా పడింది. సదస్సు జరుగుతున్న ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలోకి నీరు చేరింది. సిబ్బంది నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టారు. ఆయా దేశాల ప్రతినిధులు నీళ్లలోనే అటూఇటూ నడుస్తున్న వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది.

పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్‌ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్‌ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ పార్టీ నేత పవన్‌ ఖేరా పేర్కొన్నారు.  

జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ ఆదివారం చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహా్వనించనున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారం¿ోత్సవానికి సన్నాహకంగా ఈ ఏడాది సెపె్టంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 15 దాకా లక్షలాది గ్రామాల్లో ‘శౌర్యయాత్ర’లు నిర్వహించేందుకు బజరంగ్‌ దళ్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement