భారీ పేలుడుతో దేశరాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో ఓ కారు పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.
పేలుడు ఘటనపై ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ఆరా
- పోలీసు అధికారులు, ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులతో రేఖాగుప్తా సమావేశం
- బాధితులను పరామర్శించిన సీఎం రేఖాగుప్తా
ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హైఅలర్ట్
- పలు నగరాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ అధికారులు
- ఢిల్లీలో పేలుడు దృష్ట్యా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలో హై అలర్ట్
- హైదరాబాద్లోనూ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు
ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన, మృతి చెందినవారు హర్షుల్ S/O సంజీవ్ సేథి
- శివ జైస్వాల్ S/O తెలియదు
- మిస్టర్ సమీర్ S/O తెలియదు, మండవాలి ఢిల్లీ
- జోగిందర్ S/O తెలియదు, దిల్షాద్ గార్డెన్, ఢిల్లీ
- భవాని సంకర్ సహ్మ్రా S/O తెలియదు
- గీత డి/ఓ శివ ప్రసాద్, ఢిల్లీ
- వినయ్ పాఠక్ S/O రమా కాంత్ పాఠక్, ఢిల్లీ
- పప్పు S/O దుధ్వి రామ్,
- మిస్టర్ వినోద్ S/O విశాల్ సింగ్
- శివమ్ ఝా , ఢిల్లీ
- మహ్మద్ సాన్వాజ్, ఢిల్లీ
- అంకుష్ శర్మ , ఢిల్లీ
- మహ్మద్ ఫరూఖ్, ఢిల్లీ
తిలక్ రాజ్

ఐ20 కారు యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- హరియాణాకు చెందిన నదీమ్ఖాన్ పేరుతో ఉన్న పేలుడు జరిగిన కారు
- హుండాయ్ ఐ20 కారును తొలుత మహ్మద్ సల్మాన్ కొన్నాడు
- అనంతరం అది నదీమ్ఖాన్ అనే వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు
- పేలుడు జరిగిన ఐ20 కారు నంబరు HR267674 గా గుర్తింపు
ఆత్మాహుతి దాడి?
ఐ20 కారు లోపల ముగురు కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. కారు వెనుక వైపు నుండి పేలుడు సంభవించినట్టు సమాచారం. ఇది ఆత్మాహుతి దాడిగా పలువురు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉందని విశ్లేషకుల అంచనా
- బ్లాస్ట్ ఆందోళనకరం అంటున్న విశ్లేషకులు
- 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం
- సోమవారం కావడంతో ఆలయ సందర్శనకు పెద్ద ఎత్తున వచ్చిన జనం
- 100 నుంచి 150 మీటర్ల వరకు పేలుడు ధాటి పరిధి.
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో భారీ పేలుళ్లు
- చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాదచాయలు
- 2011 లో ఢిల్లీ హైకోర్టు దగ్గర జరిగిన పేలుళ్లు, అంటే దాదాపు 14 సంవత్సరాల తరవాత ఢిల్లీలో పేలుళ్లు జరగడం ఇదే
- భద్రతా సిబ్బంది ఊహిస్తున్నట్లు సీఎన్జీ పేలుడు కారణం కాదేమో అన్న అంచనాలు
- టెర్రరిస్టుల పనే అయి ఉంటుందని అనుమానాలు
- భీభత్సంగా మారిన సంఘటనా స్థలం
- అమిత్ షా తో ప్రధాని నరేంద్ర మోడీ సంభాషణ. సంఘటన జరిగిన తీరుపై ఆరా.
- దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేత
- మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుళ్లు
- పేలుళ్ల దెబ్బకు 6 కార్లకు వ్యాపించిన మంటలు. నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు దగ్ధం.
- ఆసుపత్రికి తరలించేలోపే 9 మంది మృతి.
- 30 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మరో 10 మంది పరిస్థితి విషమం.
- సంఘటనా స్థలానికి అంబులెన్స్, 15 ఫైర్ టెండర్ల తరలింపు.
- పేలుడు జరిగిన పరిసరాల్లో 15 చోట్ల బారికేడ్లు.
- సంఘటనా స్థలానికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర భద్రతా సిబ్బంది.
- పెద్ద ఎత్తున మోహరింపు, పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు.
- మీడియాతో సహా ఎవరినీ పేలుడు జరిగిన స్థలానికి అనుమతించని పోలీసులు.
- స్పాట్ కు చేరుకుంటున్న నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్.
- సంఘటనా స్థలానికి ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు.
- సంఘటనా స్థలం నుంచి శాంపిల్స్ సేకరిస్తున్న నిపుణులు.
- రెడ్ ఫోర్ట్ దగ్గరకు చేరుకుంటున్న సీనియర్ కాప్స్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్, డీజీపీ.
- చాందినీ చౌక్ మూసివేత. వ్యాపారులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.
- షాప్ కీపర్స్ ను పేలుడు జరిగిన ప్రాంతం నుంచి పంపించి వేసిన భద్రతా బలగాలు.
హై అలెర్ట్ లో కొత్త ఢిల్లీ - ఢిల్లీ పేలుళ్లతో అప్రమత్తమైన ఉత్తర ప్రదేశ్, వాణిజ్య రాజధాని ముంబై మహానగరం.
- అయోధ్య రాం మందిర్ దగ్గర భద్రత కట్టుదిట్టం.
- దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు.
- గత కొంతకాలంగా దేశంలోని జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్ లతో పాటు ఢిల్లీలో పాగా వేసిన ఉగ్రవాద మూకలు.
- స్లీపర్ సెల్స్ కదలికలు. నాలుగు వేల మంది పాకిస్తానీలతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్ ను గుర్తించిన పోలీసులు.
- ఢిల్లీ శివారు ప్రాంతం ఫరీదాబాదులో పెద్ద ఎత్తున అంటే దాదాపు 2560 కిలో గ్రాముల అమ్మోనియం నైట్రేట్, 350 కేజీల ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలను సీజ్ చేసిన పోలీసులు.
- ఢిల్లీ నుంచి గుజరాత్ కు భారీ స్థాయిలో రవాణా అవుతున్న పేలుడు పదార్థాలను పట్టుకున్న పోలీసులు.
నదీమ్ఖాన్ పేరుతో కారు రిజిస్ట్రేషన్
ఢిల్లీ పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తు
కేంద్ర భద్రతా సంస్థల దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
నదీమ్ఖాన్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్
హెచ్ఆర్26తో రిజిస్టర్ అయిన పేలుడు జరిగిన కారు
ఘటనాస్థలికి కేంద్ర హోం మంత్రి
(LNJP) ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్న బాదితులను పరామర్షించిన అమిత్ షా
ఢిల్లీ ఘటనా స్థలికి చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
ఢిల్లీ ఘటనాస్థలాన్ని కేంద్ర హోం అమిత్ షా పరిశీలించారు
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పేలుడు స్థలం పరిశీలన
అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న హోం మంత్రి

అమిత్ షా ఏమన్నారంటే..
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందన
సాయంత్రం 7గం. సమయంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఘటన జరిగింది
హుండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది
పేలుడు ధాటికి పలువురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి
సమాచారం అందుకున్న పది నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలిలోకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
పేలుడుపై విచారణ జరుగుతోంది
ఎన్ఐఏ, ఎన్ఎస్జీ దర్యాప్తు చేస్తున్నాయి
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు
అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది
త్వరలోనే నేను ఘటనా స్థలానికి వెళ్తాను.. క్షతగాత్రులను పరామర్శిస్తాను

ప్రధాని మోదీ ఆరా
ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా
అమిత్షాతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఘటన గురించి అడిగి వివరాలు తీసుకున్న ప్రధాని
ఘటనపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశం
ఐబీ చీఫ్,ఢిల్లీ సీపీకి అమిత్షా ఫోన్
పేలుడు ఘటన గురించి ఆరా
త్వరగతిన దర్యాప్తునకు ఆదేశం
ఎన్ఎస్జీ, ఎన్ఐఏతో పాటు దర్యాప్తు జరపనున్న ఢిల్లీ స్పెషల్ సెల్
పోలీసుల అదుపులో అనుమానితుడు
ఢిల్లీ పోలీసుల అదుపులో అనుమానితుడు
విచారిస్తున్న పోలీసులు
ముంబై పోలీసుల అప్రమత్తం
ముంబైలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు
రైల్వే స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

కదులుతున్న కారులో పేలుడు?
పేలింది పార్కింగ్ కారు కాదని ప్రకటించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా
ఎర్రకోట వద్ద ‘రెడ్సిగ్నల్ దగ్గర ఆగిన కారులు
ఆ సమయంలో నెమ్మదిగా వచ్చిన కారు
ఒకసారిగా సంభవించిన పేలుడు
ఆ సమయంలో కారులో ప్రయాణికులు
సాయంత్రం 6.52 గంటలకు పేలుడు
పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటన
హైదరాబాద్లో హైఅలర్ట్
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో హైదరాబాద్లో హైఅలర్ట్
రద్దీ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలు
పాతబస్తీలో విస్తృతంగా కొనసాగుతున్న సోదాలు
అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలి: సీపీ సజ్జనార్ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు పేలింది. ఆ తర్వాత మంటలు పక్కన్న వాహనాలకు అంటుకున్నాయి. ఏడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. గాయపడిన వాళ్లను లోక్నాయక్ జయ్ ప్రకాష్ ఆస్పత్రి (LNJP) ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పేలుడు ధాటికి ఎనిమిది వాహనాలు ధ్వంసం అయినట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతోంది. పేలుడుతో ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది.

సాయంత్రం 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ కాల్ వచ్చింది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఘటన నేపథ్యంలో కేంద్రం ఢిల్లీతో పాటు దేశంలో పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. రాజధాని, చుట్టుపక్కల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG) బృందాలు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీ పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం తప్పింది.
BREAKING: Explosion near Red Fort area in Old Delhi. Explosion near metro station.
Blasts on a day when there has been a major crackdown on terror modules plotting a strike on Delhi.
Details awaited. pic.twitter.com/tELxBP9bBh— Rahul Shivshankar (@RShivshankar) November 10, 2025


