అయోధ్య: అయోధ్య రామాలయంలో విరాళాల నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. ఆలయ ట్రస్ట్ సభ్యులతోపాటు, ముఖ్య ఉద్యోగులను అయోధ్యను విడిచి వెళ్లవద్దంటూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. భక్తులు విరాళాలుగా అందించిన బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల నమోదు, భద్రపర్చడంలో తీవ్ర వ్యత్యాసాలున్నట్లు ఆలయ అధికారుల విచారణలో తేలిందని సిట్ తెలిపింది. 2025 జనవరి–ఫిబ్రవరిలో జరిగిన మహాకుంభమేళాలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న సమయంలో ఎక్కువ అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామని సిట్ పేర్కొంది.


