సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్లో ఒక 19 ఏళ్ల యువకుడు నివాస భవనం పైనుంచి కిందపడి మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. కిందపడిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
అశోక్ విహార్ ఫేజ్-2లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం
బాధితుడిన అనురాగ్గా గుర్తించారు. ఆజాద్పూర్లోని లాలా బాగ్ నివాసి అయిన అనురాగ్ తండ్రి రాజా రామ్, ఢిల్లీ హోమ్ గార్డ్లో పనిచేస్తున్నారు. ఏమైందో తెలియద గానీ శుక్రవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఒక యువకుడు భవనంపైనుచి దూకేశాడనే సమాచారం అశోక్ విహార్ పోలీస్ స్టేషన్కు తెలిసింది. వెంటనే బాధితుడిని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. కేసు తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించడానికి క్రైమ్ టీమ్ను కూడా పిలిపించారు.పోస్ట్మార్టం , తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం మృతదేహాన్ని బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ (BJRM) ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
ఫేస్బుక్ వీడియో
దర్యాప్తులో భాగంగా ఘటనకు కొద్దిసేపటి ముందు అనురాగ్ తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. "ఇది నా మొదటి వీడియో చివరిdr కూడా. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే వాందరికీ సారీ. అలాగే నా వల్ల తమ జీవితాలు సరిగ్గా సాగడం లేదని భావించే వారికి క్షమాపణలు. చాలామందితో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ దానివల్ల మారేదేమీ లేదు" అని వీడియోలో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్య కేసు కావచ్చునని తెలుస్తోంది. అయితే, ఏదైనా కుట్ర లేదా ఇతర కారణాల కోణంతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, పోస్ట్మార్టం నివేదిక, తదుపరి దర్యాప్తు తర్వాత మరణానికి గల కారణంపై స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!


