బొగ్గు స్కామ్‌లో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు | Delhi Cbi Court Key Judgement In Coal Scam | Sakshi
Sakshi News home page

బొగ్గు స్కామ్‌లో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

Dec 11 2024 6:58 PM | Updated on Dec 11 2024 7:27 PM

Delhi Cbi Court Key Judgement In Coal Scam

సాక్షి,ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్‌ కేసులో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు బుధవారం(డిసెంబర్‌11) కీలక తీర్పిచ్చింది. యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలున్నాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.

ఈ కేసులో విచారణ అనంతరం నవభారత్‌ పవర్‌ ఎండీ హరిశ్చంద్రప్రసాద్‌, నవభారత్‌ పవర్‌ చైర్మన్‌ త్రివిక్రమప్రసాద్‌, హరిశ్చంద్ర గుప్తా,సమారియా సహా మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.ఈ మేరకు 341 పేజీల తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement