Covid-19: దేశంలో 6,500కు చేరువలో కోవిడ్‌ కేసులు | Covid 19 India touched 6491 Cases no deaths in last 24 hours | Sakshi
Sakshi News home page

Covid-19: దేశంలో 6,500కు చేరువలో కోవిడ్‌ కేసులు

Jun 9 2025 8:55 PM | Updated on Jun 9 2025 9:01 PM

Covid 19 India touched 6491 Cases  no deaths in last 24 hours

న్యూఢిల్లీ:  దేశంలో కోవిడ్‌-19 కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. ఈరోజు(సోమవారం, జూన్‌ 9) నాటికి కోవిడ్‌ కేసులు 6,500 మార్కుకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 6, 491 కేసులు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గత 24 గంటల్లో 358 కొత్త కేసులు వెలుగుచూసినట్లు సదరు శాఖ వెల్లడించింది.  అయితే మరణాలు ఏవీ సంభవించలేదని స్పష్టం చేసింది.  

దేశంలో కేరళలో అత్యధికంగా 1,957 కేసులు ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు ఉన్నాయి.  ఢిల్లీలో గత 24 గంటల్లో 42 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం ఆ రాష్ట్ర కోవిడ్‌ కేసుల సంఖ్య 728కి చేరింది. ఇదిలా ఉంచితే ఓవరాల్‌గా దేశంలో 624 మంది కోవిడ్‌ రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదు
ఇక పశ్చిమబెంగాల్‌లో వెలుగచూసిన కోవిడ్‌ కేసులపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సమీక్షా సమావేశం నిర్వహించారు.  దీనిలో భాగంగా ఆమె మాట్లాడతూ.. కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్నది పాండమిక్‌ కాదని, ఎండ్‌మిక్‌ అని ఆమె తెలిపారు.  పశ్చిమబెంగాల్‌ పరిస్థితి కోవిడ్‌ కంట్రోల్‌లోనే ఉందన్నారు మమతా. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌ 747 కోవిడ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 54 కొత్త కేసులు వెలుగుచూశాయి.   
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement