లిక్కర్‌ కేసు: కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురు | Court Reserve Kejriwal Custody Order In Cbi Case | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కామ్‌: సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌

Jun 29 2024 4:23 PM | Updated on Jun 29 2024 5:17 PM

Court Reserve Kejriwal Custody Order In Cbi Case

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కేసులో భాగంగా సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ శనివారం(జూన్‌29) రౌస్‌ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను 3 రోజులు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది. 

శనివారం  ఈ రిమాండ్‌ ముగియడంతో  శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement