ఆపరేషన్‌ సింధూర్‌లో అసువులు బాసిన సైనికులు వీరే! | Centre reveals names for first time 6 soldiers martyred in Operation Sindoor | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సింధూర్‌లో అసువులు బాసిన సైనికులు వీరే!

Jun 26 2026 12:38 PM | Updated on Jun 26 2026 12:44 PM

Centre reveals names for first time 6 soldiers martyred in Operation Sindoor

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతికారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను కేంద్రం తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది. 

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు సైనికుల వివరాలు ఇప్పుడు ఆర్మీ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  దేశ రక్షణ కోసం అసువులు బాసినవారి అత్యున్నత త్యాగానికి గుర్తుగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోఉన్ననేషనల్ వార్ మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రానైట్ ఫలకాలపై ఈఆరుగురు సైనికుల పేర్లు శాశ్వతంగా చెక్కబడతాయి. ఈ వీరులకు నివాళిగా నిర్మించిన 'త్యాగ్ చక్ర' వద్ద, వీరిలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక గ్రానైట్  పలకతో గౌరవం దక్కనుంది.

ఈ జాబితాలో ఐదుగురు ఆర్మీ సిబ్బందితో పాటు భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఒకరు ఉన్నారు.

  • సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (ఇండియన్ ఆర్మీ)
  • రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (ఇండియన్ ఆర్మీ) – మరణానంతరం వీరచక్ర పురస్కారం
  • లాన్స్ నాయక్ దినేష్ కుమార్ (ఇండియన్ ఆర్మీ)
  • అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్ (ఇండియన్ ఆర్మీ)
  • హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ (ఇండియన్ ఆర్మీ)
  • సార్జెంట్ సురేంద్ర కుమార్ (భారత వైమానిక దళం) – వాయు సేన మెడల్

ఆపరేషన్ నేపథ్యం – పహల్గామ్ ఉగ్రదాడి
గతేడాది (2025) ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పోనీ ఆపరేటర్ (గుర్రపు స్వారీ నడిపేవారు) సహా మొత్తం 26 మంది మరణించారు. దశాబ్ద కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇది.

బాధిత కుటుంబాల్లోని వితంతువుల గౌరవార్థం భారత్ ఈ సైనిక చర్యకు 'ఆపరేషన్ సింధూర్' అని నామకరణం చేసింది. ఉగ్రవాదంపై తనకున్న 'జీరో టాలరెన్స్'  విధానాన్ని భారత్ మరోసారి స్పష్టం చేసింది.

'ఆపరేషన్ సింధూర్' ఫలితాలు
ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 2025 మే 7 తెల్లవారుజామున భారత దళాలు 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో యూసుఫ్ అజర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదసిర్ అహ్మద్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులతో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

తక్షణ కాల్పుల విరమణ
భారత్ జరిపిన ఈ దాడితో పాకిస్తాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని కేంద్రం పేర్కొంది. దీనితో పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత కౌంటర్‌పార్ట్‌ను సంప్రదించారు. ఇరు దేశాల అధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2025 మే 10 నుండి భూమి, ఆకాశం మరియు సముద్ర మార్గాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయడానికి (కాల్పుల విరమణ) రెండు దేశాలు అంగీకరించాయి.
 

 ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్‌ వినలేదు : సియా, తల్లి షాకింగ్‌ రియాక్షన్‌


 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement