పైలట్‌ సుమీత్ సభర్వాల్‌ అంత్యక్రియలు పూర్తి | Captain Sabharwal's Final Farewell a Grieving Father | Sakshi
Sakshi News home page

పైలట్‌ సుమీత్ సభర్వాల్‌ అంత్యక్రియలు పూర్తి

Jun 17 2025 12:21 PM | Updated on Jun 17 2025 12:37 PM

Captain Sabharwal's Final Farewell a Grieving Father

ముంబై: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన పైలట్‌ సుమీత్ సభర్వాల్ మృతదేహాన్ని ముంబైలోని అతని స్వగృహానికి తరలించారు. పోవైలోగల జల్ వాయు విహార్‌కు మంగళవారం ఉదయం అతని మృతదేహం చేరుకోగానే, అక్కడ గంభీరమైన నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫ్లైట్ ఏI-171 ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలట్‌ సుమీత్ సభర్వాల్  ప్రాణాలు కోల్పోయారు.

పైలట్‌ సుమీత్ సభర్వాల్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు అతని ఇంటికి చేరుకున్నారు. సుమీత్‌ మృతదేహానికి అతని తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. 55 ఏళ్ల కెప్టెన్ సభర్వాల్ అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకునేందుకు ముందుగానే పదవీ విరమణ చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.

చిన్నప్పటి నుంచి సభర్వాల్‌ను తెలిసిన పొరుగువారు మాట్లాడుతూ ‘సబర్వాల్‌ కుటుంబం దశాబ్దాలుగా ఇక్కడేవుంటోంది. సబర్వాల్‌ ఎంతో ధైర్యవంతుడు. విమానం ప్రమాదంలో పడిన సమయంలో అతను విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించి ఉంటారు. వారి కుటుంబానికి ఇది తీరని నష్టం. సబర్వాల్‌ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement