‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలకు చెక్‌ | Canadas Mark Carney dials modi for g7 invite pm confirms attendance | Sakshi
Sakshi News home page

‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలకు చెక్‌

Jun 6 2025 7:13 PM | Updated on Jun 6 2025 7:55 PM

Canadas  Mark Carney dials modi for g7 invite pm confirms attendance

న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించబోయే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇంతవరకూ ప్రధాని మోదీకి ఆహ్వానం  అందలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి, ఈ సదస్సుకు ఆహ్వానించారు.  జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. దీనిపై కాంగ్రెస్‌ స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్‌ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.

‘కెనడా ప్రధాని @MarkJCarney నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించాను. ఈ నెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే జీ7 సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపాను’ అని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని జూన్ 15-17 తేదీలలో ఆల్బెర్టాలోని కననాస్కిస్ రిసార్ట్‌లో నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్‌నాథ్‌కు ‘మ్యాంగో మ్యాన్‌’ గిఫ్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement