రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం  | BSF arrests Bangladeshi national with over Rs 17 cr worth gold biscuits at WB border | Sakshi
Sakshi News home page

రూ. 17.40 కోట్ల బంగారం స్వాధీనం 

Sep 7 2026 6:21 AM | Updated on Sep 7 2026 6:21 AM

BSF arrests Bangladeshi national with over Rs 17 cr worth gold biscuits at WB border

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సుమారు రూ.17.40 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను స్వా«దీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక బంగ్లాదేశ్‌ పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. బీఎస్‌ఎఫ్‌ 32వ బెటాలియన్‌ పహారాలో ఉండే నాడియా జిల్లాలోని హల్దార్‌పారా పోస్ట్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని తెలిపారు. 

బంగ్లాదేశ్‌ జాతీయుడి నుంచి మొత్తం 11.28 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువైన దాదాపు రూ.17.40 కోట్ల విలువైన 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. 2023 ఆగస్టు నుంచి ఇప్పటివరకు దేశ సరిహద్దులో రూ.100 కోట్ల విలువైన 120 కిలోగ్రాములకు పైగా బంగారాన్ని స్వా«దీనం చేసుకోవడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement