కానిస్టేబుళ్లకు రామచరితమానస్‌ , గీతా పాఠాలు ఎక్కడో తెలుసా? | Bhagavad Gita Sessions For Constables Training in Madhya Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

కానిస్టేబుళ్లకు రామచరితమానస్‌ , గీతా పాఠాలు ఎక్కడో తెలుసా?

Nov 8 2025 12:16 PM | Updated on Nov 8 2025 1:46 PM

Bhagavad Gita Sessions For Constables Training in Madhya Pradesh

శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు భగవద్గీత తరగతులు  

భోపాల్‌:  పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్న వారందరికీ భగవద్గీత తరగతులు నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ పోలీసుల శిక్షణ విభాగం నిర్ణయించింది. ఇది వారు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఎనిమిది శిక్షణ పాఠశాలల సూపరింటెండెంట్లకు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (శిక్షణ) రాజా బాబు సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో దాదాపు 4,000 మంది యువతీ యువకులు తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్‌ శిక్షణ పొందుతున్నారు, ఇది గత జూలైలో ప్రారంభమైంది. 

రామచరితమానస్‌ పఠనం 
ఐపీఎస్‌ అధికారి సింగ్, ఈ శిక్షణ తరగతులను జూలైలో ప్రారంభించినప్పుడే.. రామచరితమానస్‌ పఠనానికి కూడా ఆదేశించారు. ఇది వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని అప్పుడే ఆయన స్పష్టం చేశారు. తాజాగా, శిక్షణ పాఠశాలల డైరెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సాధ్యమైతే, శ్రీకృష్ణుడి పవిత్ర మాసమైన మార్గశిరంలో శిక్షణలో భాగంగా... కనీసం భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాలని సూచించారు. కాగా, ఈ అధికారి గతంలో 2019 ప్రాంతంలో గ్వాలియర్‌ రేంజ్‌ పోలీసు అధిపతిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించి, స్థానిక జైలు ఖైదీలు, ఇతరులకు భగవద్గీత ప్రతులను పంపిణీ చేశారు.  

(తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్‌ : నెటిజనుల భావోద్వేగం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement