టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను! | Bengaluru techie Vipin Gupta was identified by the police in Noida | Sakshi
Sakshi News home page

టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!

Aug 18 2024 1:45 PM | Updated on Aug 18 2024 5:22 PM

Bengaluru techie Vipin Gupta was identified by the police in Noida

అదృశ్యమైన టెక్కీ దొరికాడు

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో గత 12 రోజులుగా కనబడకుండా పోయిన టెక్కీ విపిన్‌ గుప్తా ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొడిగేహళ్లి పోలీసులు నోయిడాకు వెళ్లి అతనిని తీసుకువచ్చారు. మాన్యతా టెక్‌పార్క్‌ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విపిన్‌ గుప్తా, భార్య పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. 

4వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెప్పకుండా తన కవాసకి బైక్‌లో వెళ్లిపోయాడు. గంట తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.80 లక్షలు డ్రా అయ్యాయి. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత భార్య కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతికిపెట్టాలని సోషల్‌ మీడియా ద్వారా పోలీసు శాఖకు వేడుకుంది. 

డబ్బుల కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్‌ చేసారని వాపోయింది. విషయం రచ్చ కావడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గుప్త కోసం వేట ప్రారంభించగా నోయిడాలో ఉన్నట్టు గుర్తించి తీసుకువచ్చారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు అతడు చెబుతున్నాడు. భార్యాభర్తల కలహం పోలీసులను పరుగులు పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement