ప్రముఖ నటి ఖుష్బు సుందర్ ఇంట శుభకార్యం జరిగింది. ఆమె కూతురు పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కోలీవుడ్తో పాటు టాలీవుడ్ సినితారలు సందడి చేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. అంతేకాకుండా టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా హాజరయ్యారు. కోలీవుడ్ భామ త్రిష సైతం ఈ పెళ్లి వేడుకలో మెరిసింది.
కాగా.. ఖుష్బు సుందర్ తమిళంతో పాటు తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన స్టాలిన్ చిత్రంలో ఖుష్బు సుందర్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో మెగాస్టార్కు అక్క పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రాజకీయాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తోంది.
ముగ్గురు మొనగాళ్లు in Goa#Chiranjeevi,#Nagarjuna & #Vanktesh attends #KhushbuSundar Daughter's marriage in Goa
Vintage Style - Vetaran Swag pic.twitter.com/6vPg2xjK6h— Taraq(Tarak Ram) (@tarakviews) June 25, 2026
#Khushbusundar గారి
కుమార్తె వివాహా వేడుకకు
హాజరయ్యేందుకు గోవా కు బయలుదేరి వెళ్లిన#Chiranjeevi #Nagarjuna కుటుంబాలు.@KChiruTweets @iamnagarjuna pic.twitter.com/3oMV1ZZZ0M— SZN (@Suzenbabu) June 24, 2026


