
అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.
నటన రాదని హేళన
అనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.
ఆ హీరోయిన్ల విషయంలోనూ..
ఒకప్పుడు హీరోయిన్ సిమ్రాన్ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూన్ 27న విడుదల కానుంది.
సినిమా
అనుపమ విషయానికి వస్తే.. నివీన్ పౌలీ 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజీస్, టిల్లు స్క్వేర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్, లాక్డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ చిత్రాలున్నాయి.
చదవండి: హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం