‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో 2026 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించిన హీరో రవితేజ 2027 సంక్రాంతి పండక్కి కూడా ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారనే ప్రచారం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్లో నటించనున్నారని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుందట. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.


