వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి థియేటర్లలో సందడి చేయనున్నారు శర్వానంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఆఫీస్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ– ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ఆరంభించనున్నారు. ‘‘పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూ పొందించనున్నాం. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.


