పాన్‌మసాలా ప్రచారాలు ఆపాలంటూ స్టార్‌ హీరోలకు నోటీసులు | Shah Rukh Khan, Ajay Devgn, Tiger Shroff Face FDA Notices Over Pan Masala Ads | Sakshi
Sakshi News home page

పాన్‌మసాలా ప్రచారాలు ఆపాలంటూ స్టార్‌ హీరోలకు నోటీసులు

Aug 16 2026 3:57 PM | Updated on Aug 16 2026 3:57 PM

Shah Rukh Khan, Ajay Devgn, Tiger Shroff Face FDA Notices Over Pan Masala Ads

పాన్‌మసాలా ప్రకటనల్లో నటించిన బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గన్‌,  టైగర్‌ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ‘విమల్‌’ పాన్‌మసాలా ప్రకటనలకు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను 15రోజుల్లో తొలగించాలని వీరికి ఆదేశించింది.

ఈ నోటీసులు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారాయ్‌ జారీ చేశారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆదేశాలను పాటించకపోతే 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలు, ఆహార ఉత్పత్తుల ప్రచారంపై ఉన్న నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ నోటీసులు పంపించినట్లు పేర్కొంది.

కాగా నిషేధిత ఉత్పత్తి అయిన పాన్‌ మసాలను ఇప్పటికీ సోషల్‌ మీడియాతో పాటు ఇతర వేదికల్లో ప్రచారంలో ఉన్నాయి. పాన్‌మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో ప్రముఖుల భాగస్వామ్యంపై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement