Samantha: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్
Samantha Shocking Reaction On Trolls: సోషల్ మీడియాలో సమంతకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసే పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తన మనసులోని బాధను బయటపెడుతూ ఇన్స్టాలో ఓ పోస్టును షేర్చేసుకుంది. 'ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు..అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే' అంటూ ఓ కొటేషన్ను ఇన్స్టాలో పంచుకుంది. చదవండి: విడాకుల తర్వాత..నెంబర్1 స్థానంలోకి సమంత
నాగ చైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం తప్పు అంతా సమంతదే అన్నట్లు కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఫ్యామిలీమెన్-2 వెబ్ సిరీస్లో బోల్డ్ కంటెంట్, గ్లామరస్ ఫోటో షూట్లే విడాకులకు కారణం అంటూ సమంతను దెప్పిపొడుస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ను సైతం దారుణంగా ట్రోల్ చేస్తూ అతడిపై నిందలేస్తున్నారు. ఇప్పటికే చైతూతో విడాకుల వ్యవహారంతో సమంత తీవ్ర ఒత్తడికి గురవుతున్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.
ఇటీవలె ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్న ఆమె షాట్ గ్యాప్లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు తెలుస్తుంది. విడాకుల వ్యవహారం వారి వ్యక్తిగతమని, ఇందులో ఒకరిదే తప్పు అన్నట్లు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని మరికొందరు నెటిజన్లు సామ్కు మద్ధతుగా నిలుస్తున్నారు. చదవండి: విడాకుల ఎఫెక్ట్: షూటింగ్లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు