
దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు శ్రీరామ్ శంకర్ హీరోగా నటించిన చిత్రం ఒక పథకం ప్రకారం. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే సన్ నెక్స్ట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్ కోసం 25 డాగ్స్తో ఫైట్ సీన్ తెరకెక్కించారు. కాగా.. హీరో సాయిరాం శంకర్ 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఒక పథకం ప్రకారం కథేంటంటే..
ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.