ఓటీటీలో రియల్‌ పొలిటిక‌ల్‌ థ్రిల్ల‌ర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ | The Sabarmati Report Movie Telugu Version OTT Streaming Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రియల్‌ పొలిటిక‌ల్‌ థ్రిల్ల‌ర్ సినిమా.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్‌

Jan 25 2025 8:56 AM | Updated on Jan 25 2025 10:17 AM

The Sabarmati Report Movie Telugu Version OTT Streaming Now

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్టు’(The Sabarmati Report) సినిమా సడెన్‌గా తెలుగు వర్షన్‌ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న  ఈ మూవీ.. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో విక్రాంత్‌ మాస్సే(Vikrant Massey), రిథి దిగ్రా, రాశిల్‌ ఖన్నా(Raashii Khanna) ప్రధాన పాత్రలు పోషించారు. ఏక్తా కపూర్‌ నిర్మించిన ఈ చిత్రానికి ధీరజ్‌ శర్నా దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌ 15న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.

తెలుగులో స్ట్రీమింగ్‌ 
జీ5 ఓటీటీలో  ‘ది సబర్మతి రిపోర్టు’ మూవీ జనవరి 10 నుంచే హిందీ వర్షన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా  శుక్ర‌వారం నుంచి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈమేరకు  జీ5 ఒక పోస్టర్‌ను కూడా పంచుకుంది. 12th ఫెయిల్ మూవీతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న  విక్రాంత్ మాస్సే.. ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.

మోదీ మెచ్చిన చిత్రం
గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని ‘ది సబర్మతి రిపోర్ట్‌’ చిత్రాన్ని  తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)  పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో వీక్షించనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూశారు. ఆపై చిత్ర యూనిట్‌ను ఆయన ప్రశంసించారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను రాయితీ ప్రకటించాయి. 

గోద్రా రైలు దహనకాండపై.. 
ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోద్రా  రైల్వేస్టేషన్‌లో ఆగివున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో ఎస్‌-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 22ఏళ్లుగా చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు, నిజాలు వెలుగులోకి రాబోతున్నాయని సినిమా విడుదల సమయంలో చిత్ర యూనిట్‌ భారీగా ‍ప్రచారం చేసింది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ది సబర్మతి రిపోర్టు’ సినిమాని తెరకెక్కించారు. 

 (ఇదీ చదవండి: సింహాన్ని లాక్‌ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement