Renu Desai: జీవితంలో కొన్ని సంఘటనలు బాధిస్తాయి: రేణు దేశాయ్

Renu Desai Shares A Emotional Note On Instagram Goes Viral - Sakshi

నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్‌ అప్పటి నుంచి తన కుమారుడు అకీరా నందన్‌తో పాటే ఉంటోంది.  రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వీడియోను షేర్ చేస్తూ తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది.

రేణు తన ఇన్‌స్టాలో రాస్తూ..' కొంతమంది మీ జీవితంలోకి అనుకోకుండా వస్తారు.  వేసవి రోజుల్లో చల్లని వసంత గాలిలా.. వారి చూపులతోనే నేరుగా మీ హృదయంతో మాట్లాడతారు. అదోక రహస్యమైన భాష. మీరు వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ.. వారి ప్రభావం మీపై శాశ్వతంగా ఉంటుంది.. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి కూడా ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు. మీ కన్నీళ్లను తుడిచి.. కాంతిని పంచుతారు.  అలాగే మిమ్మల్ని నవ్విస్తారు కూడా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్‌ కోసం ఫారిన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫ్లైట్‌లో తన కుమారుడితో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కాగా.. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top