
హీరో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ‘‘రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. హైదరాబాద్లో ఈ సినిమా కోసం వేసిన సెట్లో చిత్రీకరణ మొదలైంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. ఆయన ట్రేడ్మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్తో కూడన పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా కథను ఈ సినిమా కోసం సిద్ధం చేశారు కిషోర్ తిరుమల. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రవితేజ నటించిన ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ ఆగస్టు 27న రిలీజ్ కానుంది.