
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపై ప్రకటన చేశారు. తాజాగా తను నటించిన కొత్త సినిమా భైరవం విడుదలైంది. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లి ప్రస్థావన రావడంతో అందుకు క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవంగా నారా రోహిత్ పెళ్లి ఇప్పటికే జరగాల్సి ఉంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయింది. కానీ, తన తండ్రి మరణం వల్ల వాయిదా వేసుకున్నారు.
నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి. అయితే, ఇప్పుడు నారా రోహిత్ పెళ్లి టైమ్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం.. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే.