ఒకప్పుడు తన అందం, గ్లామర్తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యులో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారతీయ వివాహ సంప్రదాయాలు, మహిళలపై రుద్దుతున్న ఆచారాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మగవాళ్లకు లేని కొన్ని నిబంధనలు ఆడవాళ్లకు మాత్రమే ఎందుకని ఆమె ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
మగవాళ్లూ ఈ పనులు చేయచ్చు కాదా..
‘పెళ్లి అనేది ఇద్దరిదీ.. మరి తాళి ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి. మహిళలే బొట్టు ఎందుకు పెట్టికోవాలి. అన్ని సంప్రదాయాలు వాళ్లే ఎందుకు పాటించాలని అందరూ అంటారు. వివాహానికి సంబంధించిన సంప్రదాయాలు ఇద్దరికీ సమానంగా ఉండాలి. మగవాళ్లు కూడా ఈ పనులు చేయచ్చు కదా. భర్త కోసం ఉపవాసం చేయాలని ఎక్కడైనా ఉందా. అలాంటిదేమీ లేదు కదా. అన్ని నిబంధనలు మహిళలకే ఎందుకు? ఇవన్నీ మనం సృష్టించుకున్నవే తప్పా ఏ గ్రంథంలోనూ ఇలాంటివి లేవు’ అని నమిత అభిప్రాయ పడ్డారు.
ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
సొంతం సినిమాతో.
7 ఏళ్ల వయసులో మిస్ సూరత్గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు.


