జలియన్‌వాలా బాగ్‌ నేపథ్యంలో... | Kesari Chapter 2 trailer: Akshay Kumar and R Madhavan clash in court over Jallianwala Bagh massacre | Sakshi
Sakshi News home page

జలియన్‌వాలా బాగ్‌ నేపథ్యంలో...

Apr 4 2025 4:05 AM | Updated on Apr 4 2025 7:08 AM

Kesari Chapter 2 trailer: Akshay Kumar and R Madhavan clash in court over Jallianwala Bagh massacre

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కేసరి చాప్టర్‌ 2’. ‘అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌వాలా బాగ్‌’ అనేది ఉపశీర్షిక. కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాధవన్, అనన్యా పాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. 

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొం దింది. ట్రైలర్‌లో అక్షయ్, మాధవన్‌ల మధ్య వచ్చే డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement