లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో | GHMC ELECTIONS 2020 Anchor Udaibhanu super speech about Vote | Sakshi
Sakshi News home page

లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో

Nov 28 2020 5:15 PM | Updated on Nov 28 2020 6:00 PM

GHMC ELECTIONS  2020 Anchor Udaibhanu super speech about Vote - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలంపై స్పందించే ప్రముఖ యాంకర్‌ ఉదయభాను జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా  ఓటు హక్కుపై అద్భుతంగా మాట్లాడారు.

సాక్షి, హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందించే ప్రముఖ యాంకర్‌ ఉదయభాను పరిచయం అవసరం లేని సెలబ్రిటీ.  తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా  ఉదయ భాను మరోసారి  ట్రెండింగ్‌లో నిలిచారు. గ్రేటర్‌ పోరులో ఓటు హక్కు వినియోగంపై ఆమె అద్భుతంగా మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో అనర్గళంగా చెప్పుకొచ్చారు. ఓటు మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం అంటూ కొత్త భాష్యాన్ని చెప్పుకొచ్చారు. మాటల, అంకెల గారడీలో నాయకులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వైనాన్ని కనిపెట్టాలని సూచించారు. ఓటును నిర్వీర్యం చేయొద్దు...ఓటు వేసి తీరదాం అంటూ ఫేస్‌బుక్‌ లో ఒక వీడియోను ఉదయ భాను  పోస్ట్‌ చేశారు.  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియో మీకోసం...

Advertisement
 
Advertisement
Advertisement