
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనున్నారు. లక్ష్మీ రాధా మోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. శర్వానంద్ కెరీర్లోని ఈ 38వ సినిమా 1960ల కాలం నాటి నేపథ్యంతో ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఉంటుంది.
కాగా ఈ సినిమాలోని ఓ కీలకపాత్రకు హీరోయిన్ డింపుల్ హయతిని ఎంపిక చేసినట్లు సోమవారం చిత్రయూనిట్ ప్రకటించింది. ఆమె సరికొత్తపాత్రలో కనిపిస్తారని, కథలో చాలా ముఖ్యమైనపాత్రను డింపుల్ చేయనున్నారని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.