
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇటీవల తన కొరియోగ్రఫీతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. డాకుమహారాజ్ దబిడి దిబిడి సాంగ్పై కూడా విమర్శలొచ్చాయి. ఆ తర్వాత మరో సాంగ్ విషయంలోనూ ఇదే జరిగింది. అలా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాస్తా శృతి మించిపోయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. అలాగే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షోలో జాను లిరిని అభినందించడంతో ఆయనపై పలు రూమర్స్ వచ్చాయి.
వీరిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. ఈ విషయంపై తాజాగా ఓ పాడ్కాస్ట్లో స్పందించారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మహిళా డ్యాన్సర్ జాను విషయంలో తనని ఉద్దేశించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఎంతో బాధించాయని ఆయన తెలిపారు.
ఈ వివాదంపై జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొరియోగ్రాఫర్లకు పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. అయితే టీవీ షోలకు విషయం అలా ఏం ఉండదు. ఒక షోలో జడ్జ్గా వ్యవహరించడం రిలాక్స్గానే ఉంటుంది. నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఆ షోకు వచ్చిన వాళ్లలో ఆ అమ్మాయి బాగా చేసిందనిపించింది. అందుకే జాను బాగా చేశావని చెప్పా. దాన్ని పట్టుకుని జనాలు నేనేదో చేశానని అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టే విన్నర్ అయింది.. అది జరిగిందక్కడ.
దాన్ని కొంతమంది వేరుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఏం లేదని మా యూనిట్ అందరికీ తెలుసు. అక్కడ ఏదైనా ఉంటే మీరు అనండి. అసలు ఆ షో తర్వాత అమ్మాయి ఎవరో కూడా తెలియదు. సోషల్మీడియాలో నా పోస్టులకు ఆమె గురించి కామెంట్స్ పెట్టేవారు. ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డా. ఆమెకు కుటుంబం ఉంది.. నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు' అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో సైతం కొరియోగ్రాఫర్ల మధ్య ఎలాంటి గొడవలు లేవని శేఖర్ మాస్టర్ తెలిపారు.