కొత్త పయనం | begins new film payanam launched in Hyderabad | Sakshi
Sakshi News home page

కొత్త పయనం

Jun 9 2025 12:51 AM | Updated on Jun 9 2025 12:51 AM

begins new film payanam launched in Hyderabad

సుప్రజ్, సంగీర్తనా విపిన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పయనం’. చందు రామ్‌ దర్శకత్వంలో ఛాయా చిత్రాలు పతాకంపై స్వర్ణ కమల నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సంగీత దర్శకుడు–నటుడు రఘు కుంచె కెమెరా స్విచ్చాన్‌ చేయగా, కొరియోగ్రాఫర్‌ రఘు క్లాప్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా చందు రామ్‌ మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలో కనిపిస్తారు. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసే అంశాలెన్నో ఉన్నాయి’’ అన్నారు. ‘‘నేటి తరం ప్రేక్షకులు మెచ్చే వైవిధ్యమైన చిత్రమిది’’ అన్నారు స్వర్ణ కమల. రఘు కుంచె ఆమని, మైమ్‌ మధు, మెహబూబ్‌ భాషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: షోయబ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement