బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తతకు దారి!

- - Sakshi

అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ

గువ్వల వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని.. అడ్డుకున్న కాంగ్రెస్‌ వర్గాలు

ఘటనా స్థలం నుంచి వెళ్లి.. తర్వాత అచ్చంపేట, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో చేరిక!

ఓటమిని తప్పించుకునేందుకే ఈ డ్రామా : కాంగ్రెస్

సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నియోజకవర్గ సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు చెందిన వాహనంలో డబ్బులు వస్తున్నాయని ఆరోపించిన కొందరు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు.. శనివారం రాత్రి ఉప్పునుంతల మండలం వవెల్టూరు నుంచి వాహనాన్ని వెంబడిస్తూ అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు అడ్డుకున్నారు.

వాహనంలోని బ్యాగులను తెరిచేందుకు ప్రయత్నించగా.. ఈ క్రమంలో అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గువ్వల బాలరాజుతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఇరువురు ఎదురుపడి చూసుకుందామంటే.. చూసుకుందామంటూ మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం ఇంటికి వెళ్లిన గువ్వల బాలరాజు భోజనం చేస్తుంటే నోరు తెరిచేందుకు రావడం లేదని వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఆక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు.

అధికారులు పట్టించుకోలేదా?
అధికార పార్టీకి చెందిన రెండు వాహనాలతో పాటు ఓ పోలీస్‌ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే తాము వాహనం వెంబడించాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా సరిహద్దు నుంచి అచ్చంపేటకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి డబ్బులు అందుతున్నాయని, ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు ఆరోపించారు.

పరస్పరం ఫిర్యాదులు 
ఇదిలా ఉండగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల కార్యకర్తలు అర్ధరాత్రి వంశీకృష్ణ, గువ్వల బాలరాజులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ వేర్వేరుగా అంబేద్కర్‌ చౌరస్తా, పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల నియమావళి ఉండటంతో ధర్నాలు చేయడం సమంజసం కాదని పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

అపోలో ఆస్పత్రిలో చేరిన గువ్వల బాలరాజును ఆదివారం మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ పోతుగంటి రాములు పరామర్శించారు. చికిత్స అనంతరం సాయంత్రం గువ్వల ఆస్పత్రి నుంచి అచ్చంపేటలోని ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాల వారు సోషల్‌ మీడియాలో తమకు నచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడంతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ఓటమి భయంతోనే గువ్వల బాలరాజు దెబ్బలు తగిలినట్లు కొత్త నాటకం మొదలుపెట్టారని వంశీకృష్ణ ఆరోపిస్తుండగా.. రాజకీయంగా తనను ఎదురుకోలేక సహనం కోల్పోయి వంశీకృష్ణ రాళ్లతో దాడికి పాల్పడ్డారని గువ్వల బాలరాజు ఆరోపిస్తున్నారు. అచ్చంపేట సంఘటనపై మీ సినిమా రికార్డు అయ్యిందని పోలీసులు అన్న మాటలపై ఎన్నికల కమిషన్‌కు పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ చెప్పారు.
ఇవి చదవండి: వాదం.. ఎవరికి ఆమోదం! సీడ్‌ మాఫియాతో చీకటి ఒప్పందం..

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 13:15 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం...
14-11-2023
Nov 14, 2023, 12:49 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 12:48 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం...
14-11-2023
Nov 14, 2023, 12:14 IST
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని...
14-11-2023
Nov 14, 2023, 12:05 IST
సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...
14-11-2023
Nov 14, 2023, 11:53 IST
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల...
14-11-2023
Nov 14, 2023, 11:40 IST
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల...
14-11-2023
Nov 14, 2023, 10:51 IST
కొల్లాపూర్‌: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి...
14-11-2023
Nov 14, 2023, 10:25 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 10:11 IST
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది....
14-11-2023
Nov 14, 2023, 10:01 IST
సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం...
14-11-2023
Nov 14, 2023, 09:22 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,...
14-11-2023
Nov 14, 2023, 05:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:03 IST
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:01 IST
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్‌ ఉండాలంతే.. పంచ్‌ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్‌...
14-11-2023
Nov 14, 2023, 04:57 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న...
14-11-2023
Nov 14, 2023, 04:45 IST
ఎస్‌. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా...



 

Read also in:
Back to Top