పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 70 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 70 ఫిర్యాదులు

Jul 29 2025 10:36 AM | Updated on Jul 29 2025 10:36 AM

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 70 ఫిర్యాదులు

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 70 ఫిర్యాదులు

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు 70 ఫిర్యాదులు అందాయి. పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్‌ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 43 ఫిర్యాదులు అందగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై మూడు, కొట్లాటలపై ఐదు, వివిధ మోసాలకు సంబంధించి మూడు, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, దొంగతనాలకు సంబంధించి రెండు, ఇతర చిన్న చిన్న వివాదాలపై తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఉదయరాణి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement