
పోలీస్ పీజీఆర్ఎస్కు 70 ఫిర్యాదులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 70 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 43 ఫిర్యాదులు అందగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై మూడు, కొట్లాటలపై ఐదు, వివిధ మోసాలకు సంబంధించి మూడు, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, దొంగతనాలకు సంబంధించి రెండు, ఇతర చిన్న చిన్న వివాదాలపై తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఉదయరాణి ఆదేశించారు.