విజయవాడ డీఆర్‌ఎంగా మోహిత్‌ సోనాకియా | - | Sakshi
Sakshi News home page

విజయవాడ డీఆర్‌ఎంగా మోహిత్‌ సోనాకియా

Jul 29 2025 10:36 AM | Updated on Jul 29 2025 10:36 AM

విజయవాడ డీఆర్‌ఎంగా మోహిత్‌ సోనాకియా

విజయవాడ డీఆర్‌ఎంగా మోహిత్‌ సోనాకియా

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డీఆర్‌ఎంగా మోహిత్‌ సోనాకియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1995, 1997లో ఐఐటీ కాన్పూర్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌, అనంతరం మాస్టర్‌ డిగ్రి పొందిన ఆయన 1998లో ఉత్తర రైల్వేలోని ఘజియాబాద్‌లో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా భారతీయ రైల్వే సర్వీసులో చేరారు. ఈ కొత్త నియామకానికి ముందు ఆయన రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ (పీసీఈఈ)గా విధులు నిర్వర్తించారు. భారతీయ రైల్వేలో ఆయనకు 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఏపీఎంఆర్‌సీలో కాన్పూర్‌ మెట్రో ప్రియారిటీ కారిడార్‌ను ప్రారంభించడంలో, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలోని వారణాసి డివిజన్‌లో ఛప్రా–గోరఖ్‌పూర్‌ విభాగంలో విద్యుదీకరణ ప్రాజెక్ట్‌లలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్‌ బ్రాంచ్‌ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement