సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్‌ అబ్బాయి | - | Sakshi
Sakshi News home page

సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్‌ అబ్బాయి

Apr 4 2024 12:10 AM | Updated on Apr 4 2024 1:32 PM

- - Sakshi

పెళ్లి మండపంలో మార్క్‌ మన్‌సిల్లా, లావణ్య

మూడుముళ్లతో ఒక్కటైన జంట

ఖమ్మం: వారి ప్రేమ ఖండాంతరాలు దాటి వివాహ బంధంతో ఏకమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కళాశాల డైరెక్టర్‌ మందడపు సత్యనారాయణ – సుజని దంపతుల కుమార్తె లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ రంగంలో స్టాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది.

ఆమెకు అదే కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన స్పెయిన్‌ దేశానికి చెందిన మార్క్‌ మన్‌సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. సత్తుపల్లిలోని శ్రీసాయిబాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం అర్ధరాత్రి 12.53 నిమిషా లకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు.

ఇవి చదవండి: శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement