కేఎస్‌ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కేఎస్‌ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

Jun 15 2023 7:28 AM | Updated on Jun 15 2023 8:29 AM

మోరీలోకి దూసుకెళ్లిన బస్సు  - Sakshi

మోరీలోకి దూసుకెళ్లిన బస్సు

సోమందేపల్లి: పుట్టపర్తి జిల్లా పెనుకొండ పరిధిలోని సోమందేపల్లిలోని మణికంఠ కాలనీ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న మోరీని బస్సు ఢీ కొట్టింది. కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి బెంగళూరుకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ లగ్జరీ బస్సు అదుపు తప్పి మోరీని ఢీకొని కొంతభాగం దూసుకుపోయింది. 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఆ సమయంలో దాదాపు 40 మంది దాకా ప్రయాణికులు అందులో ఉన్నారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు సీట్లకు కొట్టుకుని గాయపడ్డారు. పోలీసులు వచ్చి 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రయాణికులు వేరే బస్సుల్లో బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement