‘మీ అబ్బాయిని గంజాయి కేసులో పట్టుకున్నాం..’ | - | Sakshi
Sakshi News home page

‘మీ అబ్బాయిని గంజాయి కేసులో పట్టుకున్నాం..’

Sep 17 2024 1:30 AM | Updated on Sep 17 2024 9:30 AM

-

డబ్బులు పంపిస్తే విడిచిపెడతాం..

పోలీస్‌ అధికారి ప్రొఫైల్‌ ఫొటోతో కాల్‌

రూ.14వేలు ఫోన్‌పేలో పంపిన బాధితుడు

మేడిపల్లి: భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్‌ నేరగాడు మోసం చేశాడు. రూ.14వేలు ఫోన్‌పేలో పంపి మోసపోయాడు. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొడుకు హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తున్నాడు. సోమవారం ఉదయం సదరు వ్యక్తికి పోలీస్‌ అధికారి ప్రొఫైల్‌ ఫొటోతో కాల్‌ చేసి ‘మీ అబ్బయిని గంజాయి కేసులో పట్టుకున్నాం. మీరు హైదరాబాద్‌ రావాలి..’ అని చెప్పడంతో అవాక్కయ్యాడు. 

కొడుకు పేరుతో సహా వివరాలు పక్కగా చెప్పడంతో పాటు ‘మీ కొడుకుతో ఫోన్‌లో మాట్లాడండి..’ అని చెప్పగా.. అక్కడ ఏడుపులు వినిపించాయి. ‘ముగ్గురిపై కేసు నమోదు చేశాం.. మీ కొడుకుపై కేసు వద్దంటే రూ.35వేలు ఇచ్చి తీసుకెళ్లండి..’ అని నమ్మించారు. దీంతో తన వద్ద అంత డబ్బులేదని, కేవలం రూ.14వేలు మాత్రమే ఉన్నాయని బాధితుడు చెప్పగా.. ప్రస్తుతానికి ఆ డబ్బులు ఫోన్‌పేలో పంపాలని సూచించారు.

 మిగిలిన డబ్బులు స్టేషన్‌ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఇవ్వండి..’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. దీంతో బాధితుడు సదరు వ్యక్తి చెప్పిన నంబర్‌కు ఫోన్‌పే ద్వారా పంపించాడు. తనకు కాల్‌ వచ్చిన నంబరు, ఫోన్‌పే నంబర్‌ వేరేగా ఉండడంతో అనుమానం అచ్చిన బాధితుడు తన కొడుకుకు ఫోన్‌ చేశాడు. తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పడంతో కంగుతిన్న బాధితుడు మేడిపల్లి ఎస్త్సె శ్యాంరాజ్‌కు ఫిర్యాదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement